డీఆర్ఎస్ సమీక్షలో ధావన్ ఔట్
విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 29 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. ఆష్లే నర్స్ వేసిన 8.4వ బంతిని ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో నర్స్ డీఆర్ఎస్కు వెళ్లాడు. అందులో ధావన్ ఔటైనట్టు తేలింది. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి అంబటి రాయుడు వచ్చాడు.
ఆదిలోనే టీమిండియా తడబాటు
విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(4) రోచ్ బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్కు ఎంతగానో అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ ఔట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు.
|
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకు ముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో కెప్టెన్ కోహ్లి ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ని తప్పించి.. అతని స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకున్నాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో ఈ మ్యాచ్లో భారత్ బరిలోకి దిగుతోంది.
|
1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా
ఐదు వన్డేల సీరిస్లో ఇప్పటికే కోహ్లీ సేన తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. అదే ఊపుతో అచ్చొచ్చిన వైజాగ్లో మరో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లురుతోంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 8 వన్డేలాడిన భారత్ జట్టు ఏకంగా ఆరింట్లో గెలుపొందగా.. ఒక మ్యాచ్లో మాత్రమే ఓడింది.
|
టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్
అది కూడా వెస్టిండీస్ చేతిలో. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్లే ప్రతీ సారి విజయం సాధించాయి. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లాడిన జట్టుగా భారత్ అరుదైన ఘనత వహించింది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్లో 949మ్యాచ్లాడిన భారత్.. 490మ్యాచ్ల్లో విజయం సాధించగా, 411మ్యాచ్ల్లో ఓటమి పాలైంది.