న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన దినేశ్ కార్తీక్

India vs West Indies, 1st T20I: Dinesh Karthik become 2nd most dismissals by wicketkeepers in T20s

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్‌ అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరుగుతోంది.

 ధోని స్థానంలో రిషబ్ పంత్

ధోని స్థానంలో రిషబ్ పంత్

ఈ మూడు టీ20ల సిరిస్ నుంచి ధోనిని తప్పించిన భారత సెలక్టర్లు అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమివ్వగా రెండో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ సిరిస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో పంత్‌కు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా చోటు కల్పించిన జట్టు మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తీక్‌కు వికెట్ కీపింగ్ పగ్గాలు అప్పగించింది.

మూడు క్యాచ్‌లు పట్టిన దినేశ్ కార్తీక్

మూడు క్యాచ్‌లు పట్టిన దినేశ్ కార్తీక్

దీంతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ అరుదైన ఘతన సాధించాడు. ఈ మ్యాచ్‌లో రామ్‌దిన్‌, హెట్‌మైర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌ క్యాచ్‌లను దినేశ్‌ కార్తీక్‌ పట్టాడు.

సంగక్కర రికార్డుని బద్దలు కొట్టిన కార్తీక్

సంగక్కర రికార్డుని బద్దలు కొట్టిన కార్తీక్

అదే సమయంలో లంక మాజీ వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర(142) రికార్డును కూడా దినేశ్‌ కార్తీక్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ 143 క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ధోని 151 క్యాచ్‌లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కమ్రాన్‌ అక్మల్‌(123), దినేశ్‌ రామ్‌దిన్‌(120)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

తొలి టీ20లో టీమిండియా విజయం

తొలి టీ20లో టీమిండియా విజయం

కాగా, వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌(31 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా(21 నాటౌట్‌)లు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Monday, November 5, 2018, 17:56 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X