
ఆదిలోనే షాక్:
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు విండీస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ షాక్ ఇచ్చాడు. ఏడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (6)ను పెవిలియన్ చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమయిన రాహుల్.. షిమ్రాన్ హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కీలక రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలో పడింది.

పంత్ ధనాధన్:
అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. అయితే ఆరు ఫోర్లు కొట్టి మంచి జోరుమీదున్న రోహిత్.. పోలార్డ్ చేతికి చిక్కాడు. జోసెఫ్ బౌలింగ్లో రోహిత్ (36) పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ను ముందుండి నడిపించే బాధ్యతను అయ్యర్ తీసుకున్నాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతడు కుదురుకున్నాక జోరు పెంచాడు.

హఫ్ సెంచరీలు:
క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం తన ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. మొదటగా శ్రేయాస్ హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది ఐదో హాఫ్సెంచరీ. అయ్యర్ సహకారంతో బౌండరీలతో రెచ్చిపోయిన పంత్ కూడా హఫ్ సెంచరీ చేసాడు. వన్డే కెరీర్లో పంత్కిదే తొలి అర్ధ శతకం కావడం విశేషం. వరుస వైఫల్యాలపై విమర్శలు ఎదుర్కొంటున్న పంత్.. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు.

మెరిసిన జాదవ్:
అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ 70 ( 88 బంతుల్లో; 5 ఫోర్లు, ఒక సిక్స్)పెవిలియన్ చేరాడు. మరోకొద్దిసేపటికే పంత్ 71 (69 బంతుల్లో; 7 ఫోర్లు, ఒక సిక్స్) కూడా ఔట్ అయ్యాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా (21)తో కలిసి కేదార్ జాదవ్ (40) విలువైన పరుగులు చేసాడు. ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడే క్రమంలో శివమ్ దూబే (9) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ (7), మొహమ్మద్ షమీ (0) చివరకు క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications












