న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్‌ ఘన విజయం!!

India VS West Indies 1st ODI : Team India Surprised With Hetmyer's Ton Lead WI To 8 Wicket Win
India vs West Indies 1st ODI: Shimron Hetmyer, Shai Hope tons give WI 1-0 lead

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విండీస్ యువ బ్యాట్స్‌మెన్ హెట్మయిర్ సెంచరీ (106 బంతుల్లో 139: 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. అతనికి ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 పరుగులు: 7 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేసి మంచి సహకారం అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బుధవారం రెండో వన్డే విశాఖపట్నంలో జరగనుంది.

<strong>న్యూజిలాండ్‌ సిరీస్‌కు భువనేశ్వర్‌ అనుమానమే.. ఐపీఎల్‌తో పునరాగమనం?!!</strong>న్యూజిలాండ్‌ సిరీస్‌కు భువనేశ్వర్‌ అనుమానమే.. ఐపీఎల్‌తో పునరాగమనం?!!

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సునీల్ అంబ్రీస్ (9) త్వరగానే పెవిలియన్ చేరాడు. పేసర్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అనంతరం హెట్మయిర్ రాకతో విండీస్ ఇన్నింగ్స్ కుదురుకుంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు హోప్ అతనికి చక్కటి సహకారం అందించాడు.

హెట్మయిర్ దూకుడు:

హెట్మయిర్ దూకుడు:

హెట్మయిర్ దూకుడుగా ఆడుతూ 50 బంతుల్లో 50 పరుగులు చేసాడు. అనంతరం సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇదే సమయంలో హోప్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన హెట్మయిర్.. 80 బంతుల్లోనే సెంచరీ చేసాడు. 106 బంతుల్లో 139 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.

హోప్ సెంచరీ:

హోప్ సెంచరీ:

హెట్మయిర్ అవుట్ అయిన అనంతరం పూరన్ (29) అండతో హోప్ సెంచరీ చేసాడు. 48వ ఓవర్ నాలుగో బంతికి, ఐదో బంతికి వరుసగా రెండు ఫోర్లు కొట్టి పూరన్ మ్యాచ్‌ను ముగించాడు. చివరి వరకు క్రీజులో ఉండి సెంచరీ చేసుకున్న హోప్ నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, షమీ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో తరువాత జరగనున్న రెండు మ్యాచ్‌ల్లో గెలుపు కీలకం అయింది. రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే సిరీస్ టీమిండియాకు దక్కుతుంది.

అయ్యర్‌, పంత్‌ హఫ్‌ సెంచరీలు:

అయ్యర్‌, పంత్‌ హఫ్‌ సెంచరీలు:

మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (70), రిషబ్‌ పంత్‌ (71)లు హఫ్‌ సెంచరీలతో రాణించారు. కేదార్ జాదవ్ (40) పరుగులతో ఆకట్టుకున్నాడు. రోహిత్ (36) పర్వాలేదనిపించగా.. రాహుల్ (6), కోహ్లీ (4) నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Sunday, December 15, 2019, 22:42 [IST]
Other articles published on Dec 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X