|
ధోని చేతుల మీదుగా వన్డే క్యాప్ని అందుకున్న పంత్
మరోవైపు ఈ మ్యాచ్లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా తన వన్డే క్యాప్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా రిషబ్ పంత్ ఆడనున్నాడు. కాగా, క్రికెట్ మైదానంలో 100 శాతం ఆటను ప్రదర్శించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని పంత్ అన్నాడు.
|
జాసన్ హోల్డర్ మాట్లాడుతూ
కాగా, ఈ పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేయాలని తాను అనుకోలేదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పాడు. జట్టులో యువకులు అధికంగా ఉన్నారని, వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నాడు. హేమ్రాజ్ ఓపెనింగ్ చేస్తాడని, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి ఓషానే థామస్ వచ్చాడని హోల్డర్ తెలిపాడు.
|
బర్సాపర మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే
ఈ మ్యాచ్కు సంబంధించి మరో ఆసక్తికర విషయమేంటంటే.. బర్సాపర మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు ఐదు వన్డేల పోరుపై దృష్టి సారించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన విండీస్.. వన్డేల్లో సత్తా చాటాలని చూస్తుండగా.. వన్డేల్లో అయినా గట్టి పోటీ ఇవ్వాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
|
ఐదో భారతీయ క్రికెటర్గా కోహ్లీ
ఈ వన్డే సిరిస్లో విరాట్ కోహ్లీ మరో 221 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన ఐదో భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందుతాడు. సచిన్ ఈ ఫీట్ను 259 ఇన్నింగ్స్లో అందుకున్నాడు. మరోవైపు గత నాలుగేళ్ల(2014) నుంచి భారత్పై వెస్టిండిస్ వన్డే సిరీస్ గెలువలేదు. ఈ సిరిస్లో మరో 177 పరుగులు చేస్తే 5000 పరుగులను అత్యంత వేగంగా సాధించిన భారత బ్యాట్స్మన్గా శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధిస్తాడు.
|
జట్ల వివరాలు
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, ఎం.ఎస్.ధోనీ(వికెట్ కీపర్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్
విండీస్ జట్టు: కీరన్ పావెల్, చంద్రపాల్ హేమ్రాజ్, షాయి హోమ్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మైర్, మార్లోన్ సామ్యూల్స్, రోవ్మన్ పావెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), అష్లే నర్స్, దేవేంద్ర బిషూ, కెమర్ రోచ్, ఓషానే థామస్