హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టు తొలిరోజైన శనివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ను పట్టే క్రమంలో ఫీల్డర్ షూ ఊడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లంకతో మూడో టెస్టు: కోట్లాలో కోహ్లీ తొలి టెస్టు సెంచరీ
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఓపెనర్లుగా ధావన్-మురళీ విజయ్ క్రీజులోకి వచ్చారు. పది ఓవర్లలో ఓపెనర్లు విజయ్-ధావన్ తొలి వికెట్కు 42 పరుగులు జోడించారు. పెరీరా వేసిన ఇన్నింగ్స్ 9.6వ బంతిని ధావన్ గాల్లోకి లేపాడు. బౌండరీ లైన్ సమీపంలో ఉన్న లక్మల్ బంతిని క్యాచ్ పట్టేందుకు వేగంగా పరుగెత్తాడు.
ఈ క్రమంలో అతడు బ్యాలెన్స్ కోల్పోవడంతో కాలికి వేసుకున్న షూ ఊడిపోయింది. ఇందుకు వీడియోను బీసీసీఐ తన అధికారిక ఖాతాలో అభిమానులతో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ధావన్ వికెట్ దిల్రువాన్ పెరీరాకు టెస్టుల్లో 100వ వికెట్ కావడం విశేషం.
25 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసిన తొలి శ్రీలంక బౌలర్గా పెరీరా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు మురళీధరన్ ముత్తయ్య పేరిట ఉండేది. మురళీధరన్ 27 టెస్టుల్లో ఈ పీట్ సాధించాడు. తర్వాతి స్థానంలో హెరాత్ (29 టెస్టులు) ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.