
తొలి వికెట్ కీపర్గా
శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 2-0 తో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లో ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. కాగా టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని 90 టెస్టు మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్క సారి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోలేకపోయాడు.

గురువును మించిన శిష్యుడు
మహేంద్రసింగ్ ధోని వల్ల కూడా కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ను రిషబ్ పంత్ గెలుచుకోవడంతో ప్రస్తుతం అతనిపై అంతట ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు గురువును మించిన శిష్యుడు అంటూ రిషబ్ పంత్ను తెగ పొగిడేస్తున్నారు.
అయితే ఒక్క ధోని మాత్రమే కాదు టీమిండియా వికెట్ కీపర్లుగా చాలా మందే పని చేసినప్పటికీ ఎవరూ కనీసం ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోలేకపోయారు. గతంలో టీమిండియా వికెట్ కీపర్లుగా వృద్ధిమాన్ సాహా, కిరణ్ మోరే, సయ్యద్ కిర్మాణి సైతం విశేష సేవలు అందించారు. కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనేది వారందరికీ కలగానే మిగిలిపోయింది.

చెలరేగిన పంత్
ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్లో బ్యాటర్గా రిషబ్ పంత్ దుమ్ములేపాడు. సిరీస్ అసాంతం టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్లో 3 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన పంత్.. 61 సగటుతో 185 పరుగులు చేశాడు. స్ట్రైక్రేట్ 120గా నమోదైంది. ఈ క్రమంలో 23 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. మొహాలీ టెస్టులో 97 బంతుల్లో 96 పరుగులు చేసిన పంత్.. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో 26 బంతుల్లో 39 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 30 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

టీమిండియా ఘన విజయం
ఇక బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 3 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన 238 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 447 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 208 పరుగులకే ఆలౌట్ అయింది.
స్కోర్లు:
భారత్: 252, 303-8 డిక్లేర్
శ్రీలంక: 109, 208.


Click it and Unblock the Notifications












