న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka: తొలి సెష‌న్ టీమిండియాదే.. 204 ప‌రుగుల అధిక్యంలో రోహిత్ సేన‌

India vs Sri Lanka Pink-ball Test Day 2: Completed First Session.. India lead by 204 runs.. 2nd innings Score- 61-1

బెంగ‌ళూరు: పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట‌లో కూడా టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగుతుంది. 143 ప‌రుగుల అధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి సెష‌న్ ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ (30), హ‌నుమ విహారీ (8) ఉన్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌పై టీమిండియా 204 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. అంత‌కుముందు శ్రీ‌లంక‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంతో తొలి సెష‌న్‌లో టీమిండియా పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

మ‌యాంక్ అగ‌ర్వాల్ మ‌ళ్లీ విఫ‌లం

143 ప‌రుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్‌ 42 ప‌రుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ మ‌రోసాని నిరాశ‌ప‌రిచాడు. 22 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎంబుల్దేనియా బౌలింగ్‌లో డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 34 బంతులు ఎదుర్కొన్న మ‌యాంక్ 3 ఫోర్ల‌తో క్రీజులో కుదురుకున్న‌ట్లే క‌నిపించాడు. కానీ త్వ‌ర‌గా ఔటై మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 ప‌రుగులే చేసిన మ‌యాంక్ అగ‌ర్వాల్.. తొలి టెస్టులోనూ నిరాశ‌ప‌రిచాడు.

తొలి సెష‌న్‌లో 5 వికెట్లు

అనంత‌రం హ‌నుమ విహారీతో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలి సెష‌న్ ముగిసే స‌మ‌యానికి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. దీంతో తొలి సెష‌న్ ముగిసే స‌మ‌యానికి టీమిండియా వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ (30), హ‌నుమ విహారీ (8) ఉన్నారు. 23.5 ఓవ‌ర్ల‌పాటు సాగిన తొలి సెష‌న్‌లో 84 ప‌రుగులు రాగా 5 వికెట్లు నెల‌కూలాయి.

చెల‌రేగిన బుమ్రా, అశ్విన్

86-6 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రీ‌లంక‌ కాసేప‌టికే జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒక్క‌ ప‌రుగు చేసిన ఎంబుల్దేనియి వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు క్యాచ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లోనే 5 ప‌రుగులు చేసిన ల‌క్మ‌ల్‌ను అశ్విన్‌ అద్భుత బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో 21 ప‌రుగులు చేసిన డిక్వెల్లా.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. మ‌ళ్లీ త‌ర్వాతి ఓవ‌ర్లోనే 8 ప‌రుగులు చేసిన విశ్వ ఫెర్నాండో అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో శ్రీ‌లంక 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు

కాగా రెండో రోజు ఆట‌లో వ‌రుస‌గా 4 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక 4 వికెట్లు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజు శ్రీ‌లంక 5.5 ఓవ‌ర్లు మాత్ర‌మే బ్యాటింగ్ చేసి మిగ‌తా 4 వికెట్లు కోల్పోయింది. లంక బ్యాట‌ర్ల‌లో మాథ్యూస్ 43, డిక్వెల్లా 21, ధ‌నుంజ‌య డిసిల్వా 10 మాత్ర‌మే రెండెంకెల స్కోర్ చేశారు. మిగ‌తా వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, ష‌మీ రెండేసి వికెట్లు, అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశారు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 ప‌రుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 ప‌రుగుల అధిక్యం ల‌భించింది.

Story first published: Sunday, March 13, 2022, 16:32 [IST]
Other articles published on Mar 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X