కొలంబో: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్టులో గెలుపుతో 2-0తో సిరీస్ కూడా భారత్ వశమైంది.
తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో తొలుత నిలకడగా ఆడినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వికెట్లు కూలాయి.

దీంతో విజయం భారత్ వశమైంది. ఓవర్ నైట్ స్కోరు 209/2తో శ్రీలంక మ్యాచ్ నాలుగో రోజు ప్రారంభమైంది. ఆరంభంలో బాగానే ఆడారు. కానీ ఆ తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. దీంతో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 622 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 183 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం ఫాలో ఆన్ ఆడింది. లంక 386 పరుగులకే కుప్ప కూలింది. కొలంబో టెస్టులో స్పిన్నర్లు విజయాన్ని అందించారు. తొలి సెషన్లో అశ్విన్, రెండో సెషన్లో జడెజా వీరవిహారం చేశారు.