
50కి దిగువగా కోహ్లీ సగటు
శ్రీలంకతో రెండో టెస్టులో విఫలమవడంతో విరాట్ టెస్టు కెరీర్ సగటు 50కి దిగువగా పడిపోయింది. కోహ్లీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 23, సెకండ్ ఇన్నింగ్స్లో 13 పరుగులు చేశాడు. ఈ టెస్టులో కోహ్లీ 43 పరుగులు చేసి ఉంటే అతని సగటు 50కి పైనే ఉండేది. కానీ కోహ్లీ 36 పరుగులే చేయడంతో టెస్టు క్రికెట్లో ఐదేళ్ల తర్వాత అతని సగటు 50 లోపలికి పడిపోయింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ సగటు 49.96గా ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. తాజాగా అదే శ్రీలంకతో కోహ్లీ సగటు మళ్లీ 49కి దిగజారింది. కాగా ఇప్పటివరకు 101 టెస్టు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 49.96 సగటుతో 8043 పరుగులు చేశాడు. ఇక టీమిండియా మళ్లీ జూలై వరకు టెస్టు మ్యాచ్లు ఆడే అవకాశం లేకపోవడంతో అప్పటివరకు కోహ్లీ సగటు 49గానే ఉండనుంది.

వన్డే, టీ20ల్లో మాత్రం
టెస్టు క్రికెట్లో సగటు 49కి పడిపోయినప్పటికీ వన్డే, టీ20ల్లో మాత్రం కోహ్లీ సగటు 50కి పైగానే ఉంది. వన్డేల్లో కోహ్లీ సగటు 58గా, టీ20ల్లో 51గా ఉంది. ఇప్పటివరకు 260 వన్డే మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 51 సగటుతో 12311 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 97 టీ20 మ్యాచ్లు ఆడి 51 సగటుతో 3296 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ చివరి సారిగా 2019 నవంబర్లో సెంచరీ సాధించాడు.

విజయం దిశగా భారత్
ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. బ్యాట్, బాల్తో అదరగొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక విజయానికి 419 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే తిరిమాణేను ఎల్బీగా డకౌట్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండడంతో ఈ మ్యాచ్లో ఇండియా విజయం ఖాయమైందనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications












