
వందేమాతరంతో మారుమోగిపోయిన స్టేడియం:
అయితే మ్యాచ్ ఆలస్య సమయంలో టీమిండియా అభిమానులు మైదానంలో తమ దేశభక్తిని చూపించారు. స్టేడియంలో అభిమానులంతా 'వందేమాతరం.. వందేమాతరం' అంటూ పాట పాడారు. చాలా సమయం ఇలానే చేశారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'గువాహటి, ఓ అందం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.

గూస్బంప్స్ వచ్చాయి:
బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఎంతోమంది అభిమానులు వీక్షించారు. అంతేకాదు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మ్యాచ్ జరగకున్నా..ఈ వీడియో ఎంతో సంతృప్తినిచ్చింది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. వీడియో చూస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ మంగళవారం ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
ఓపికగా ఎదురుచూసారు:
బర్సపర ఫ్లాట్ పిచ్తో పాటు బౌండరీల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ వర్షం అభిమానులను నిరాశకు గురిచేసింది. మైదానంలో రాత్రి 10 గంటలకు వారు ఓపికగా ఎదురుచూసారు. గత వారం రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా వర్షం కురిసింది. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది.


Click it and Unblock the Notifications












