హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్లో భాగంగా డర్బన్లోని కింగ్స్మీడ్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో జట్టుని విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. సఫారీ గడ్డపై కోహ్లీకి ఇది తొలి సెంచరీ. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లను సైతం అభిమానులుగా మార్చేసుకున్నాడు.
ముఖ్యంగా తొలి వన్డేలో కోహ్లీ ఆటతీరుకి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఫిదా అయ్యాడు. 112 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై పెవిలియన్కు వెళ్తున్న కోహ్లీని అభినందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో SpiritOfCricketగా నిలిచింది.
సఫారీ బౌలర్ ఫెలుక్వాయో బౌలింగ్లో 44.3వ ఓవర్ వద్ద విరాట్ కోహ్లీ (112) రబడకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా వీక్షించిన బౌలర్ ఇమ్రాన్ తాహీర్ పరిగెత్తుకుంటూ కోహ్లీ వద్దకు వచ్చి అభినందించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదే ఫొటోను తాహీర్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'కోహ్లీతో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవం'గా భావిస్తున్నాను అని కామెంట్ కూడా పెట్టాడు. ఈ ఫోటోను అభిమానులకు షేర్ చేసిన ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అని పేర్కొంది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఇమ్రాన్ తాహీర్ను చెన్నై సూపర్కింగ్స్ వేలంలో కొనుగోలు చేసింది.
#SpiritOfCricket pic.twitter.com/MSlGtYpgpw
— ICC (@ICC) February 1, 2018
ఇదిలా ఉంటే ఆరు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం సెంచూరియన్ వేదికగా జరగనుంది. తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధించడంతో సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.