For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ టెస్ట్: ఇన్నింగ్స్ 202 పరుగులతో భారత్ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌!!

IND vs SA 3rd Test Highlights : India Win Ranchi Test By Innings And 202 Runs || Oneindia Telugu
India vs South Africa: Shahbaz Nadeem help India won by an innings and 202 runs, India seal 3-0 sweep

రాంచీ: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. చివరి రెండు వికెట్లను లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్‌ నదీమ్‌ తీయడంతో ఇన్నింగ్స్ 202 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు టెస్టుల్లో కొంత ప్రతిఘటన కనబర్చిన సఫారీలు.. ఈ సారి అదీ లేకుండా పూర్తిగా తలొగ్గడంతో భారత్ విజయం నల్లేరుపై నడకగా మారింది.

నదీమ్‌ మాయ

నదీమ్‌ మాయ

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో నాలుగో రోజు మంగళవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా కేవలం రెండు ఓవర్లలోనే ఆలౌట్ అయింది. లోకల్ స్పిన్న‌ర్‌ నదీమ్‌ చివరి రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలారు. నోర్జెతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన డిబ్రుయిన్‌ (30).. రెండో ఓవర్‌లోనే నదీమ్‌ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో నిన్నటి నుండి పోరాడుతున్న డిబ్రుయిన్‌ కథ ముగిసింది.

ఎంగిడి డకౌట్:

ఎంగిడి డకౌట్:

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి ఒక్క బంతి మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. తొలి బంతినే షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి నేరుగా వెళ్లి అవతల ఎండ్‌లో ఉన్న నాన్ స్ట్రైకర్ నోర్జెకి బలంగా తగిలి గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న నదీమ్‌ వెంటనే స్పందించి సూపర్ క్యాచ్‌ పట్టడంతో సఫారీల పని అయిపొయింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది.

 లిండె పోరాటం:

లిండె పోరాటం:

తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఎల్గర్ (0), డికాక్ (4), డుప్లెసిస్ (1) త్వరగానే ఔటయ్యారు. నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాక.. హమ్జ (61) ఔట్ అయ్యాడు. మరుసటి ఓవర్‌లో బవుమా కూడా వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం వేగంగా సాగింది. క్లాసెన్ (6), పీట్ (4), రబాడ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో లిండె (81 బంతుల్లో 37), నోర్జే (55 బంతుల్లో 4) పోరాడటంతో దక్షిణాఫ్రికా 162 పరుగులు చేయగలిగింది.

ఫాలోఆన్‌ ఆడిన సఫారీలు:

ఫాలోఆన్‌ ఆడిన సఫారీలు:

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించడంతో సఫారీకిలకు ఫాలోఆన్‌ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ప్రొటీస్ పోటీ ఇవ్వలేకపోయింది. రిటైర్డ్‌హర్ట్‌ ఎల్గర్‌ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. డికాక్‌ (5), హమ్జా (0), డుప్లెసిస్‌ (4), బవుమా (0)లు పరుగులు చేసారు. లిండే, పీట్‌ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్‌ ఆదుకున్నాడు. నాలుగో రోజు నదీమ్ మాయ చేయడంతో బ్రుయిన్‌, నోర్జే పెవిలియన్ చేరారు. భారత్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 497 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే. రోహిత్ డబుల్ సెంచరీ, రహానే సెంచరీ చేసారు.

Story first published: Tuesday, October 22, 2019, 10:48 [IST]
Other articles published on Oct 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+