|
2000 పరుగుల మైలురాయిని
అంతేకాదు టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయిని కూడా రోహిత్ శర్మ అందుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా మయాంక్, పుజారా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో రోహిత్ శర్మ భాద్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు రహానే అతడికి చక్కటి సహకారం అందించాడు.
|
అరుదైన రికార్డు
రోహిత్ శర్మ సెంచరీ సాధించే క్రమంలో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. రాంచీ టెస్టులో రోహిత్ శర్మ తన సెంచరీని సిక్స్తోనే సాధించాడు. 132 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు.
హెట్మెయిర్ రికార్డు బద్దలు
దీంతో ఈ సిరీస్లో 16వ సిక్సర్ను రోహిత్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే విండిస్ ఆటగాడు హెట్మెయిర్ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 2018-19 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో హెట్మెయిర్ 15 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్ బద్దలు కొట్టాడు.
అగ్రస్థానంలో రోహిత్ శర్మ
మరోవైపు 2019లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్(15) సిక్సర్ల రికార్డుని రోహిత్ బద్దలు కొట్టాడు. స్టోక్స్ 16 ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు కొడితే.. రోహిత్ శర్మ ఈ సిరీస్లో 3 ఇన్నింగ్స్లోనే 13 సిక్సర్లను బాదాడు. మూడో టెస్టులో ఇప్పటికే 4 సిక్సర్లు బాదాడు.
భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు
ఇక, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డుని కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 2010-11 సీజన్లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. ఇప్పుడు దానిని రోహిత్ శర్మ అధిగమించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ సిక్స్తో సెంచరీ పూర్తి చేశాడు.