
10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్ల్లో
దీంతో 10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ అత్యధిక సగటుతో అగ్రస్థానంలోనిలిచాడు. కాగా, టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టుల్లో సైతం డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడు టెస్టుల్లో భారత్ తరఫున మూడు డబుల్ సెంచరీలు
మరోవైపు వరుసగా మూడు టెస్టుల్లో భారత్ తరఫున మూడు డబుల్ సెంచరీలు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో ఇంగ్లండ్పై కోహ్లీ 235, కరుణ్ నాయర్ 303 నాటౌట్, కోహ్లీ 204 (బంగ్లాదేశ్పై) చేశారు. ఓ సిరీస్లో 500కుపైగా పరుగులు సాధించిన ఐదో భారత బ్యాట్స్మన్గా రోహిత్ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

అజహరుద్దీన్ రికార్డు బద్దలు
వినూ మన్కడ్, బుధి కుందరన్, గవాస్కర్ (5 సార్లు), సెహ్వాగ్లు ఈ జాబితాలో ముందంజలో ఉన్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికాతో సిరీస్లో రెండుసార్లు 150కిపైగా పరుగులు చేసిన తొలి ఓపెనర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇదే జట్టుపై 500కు పైగా పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అజహరుద్దీన్ (1996/97లో 388 పరుగులు) రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.

ఒకే సిరీస్లో ముగ్గురు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరిస్లో భారత బ్యాట్స్మెన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒకే సిరిస్లో ముగ్గురు భారత ఆటగాళ్లు డబుల్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తొలి టెస్టులో మయాంక్, రెండో టెస్టులో విరాట్, తాజాగా రోహిత్ ఈ ఫీట్ సాధించారు. అయితే 1955/56లో న్యూజిలాండ్తో జరిగిన సిరిస్లో కూడా మూడు డబుల్ సెంచరీలు సాధించారు.


Click it and Unblock the Notifications
