116 ఓవర్లకు 419 పరుగులు చేసిన టీమిండియా
ప్రస్తుతం 116 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 419 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(202), రహానే(12) పరుగులతో ఉన్నారు. అంతకముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమిండియా జట్టు స్కోరు 377 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది.
సఫారీ బౌలర్ ముత్తు స్వామి అరుదైన ఘనత
దక్షిణాఫ్రికా స్పిన్నర్ సెనురాన్ ముత్తు స్వామి బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తన తొలి టెస్టులోనే విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి వికెట్ సాధించడంపై ముత్తుస్వామి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ క్రమంలో ముత్తు స్వామి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి వికెట్గా తీసిన ఆటగాళ్ల జాబితాలో
విరాట్ కోహ్లీని తమ తొలి వికెట్గా తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతకముందు విరాట్ కోహ్లీని తమ తొలి వికెట్గా తీసిన వారిలో కగిసో రబడా(దక్షిణాఫ్రికా), అల్జెరీ జోసెఫ్(వెస్టిండీస్)లు ఉన్నారు. మరోవైపు పుజారా(6) విఫలం కాగా, రోహిత్ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్ సెంచరీ ముంగిట ఔటయ్యాడు.
202/0 ఓవర్నైట్ స్కోరుతో
202/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ను చేజార్చుకుంది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.
సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మన్
దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్కు చేరాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్మన్ రోహిత్ నిలిచాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సాధించాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.


Click it and Unblock the Notifications
