న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ రెండో టెస్టు: అశ్విన్ చేతిలో మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

India Vs South Africa, 2nd Test: Hosts elect to bat against; Rahul, Parthiv, Ishant in for India

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. లంచ్ విరామం వరకు ఒక్క వకెట్ కూడా కోల్పోకుండా ఆడిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ ను కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు ఎల్గర్ షాట్ కొట్టాడు. ఆ బంతిని మురళీ విజయ్ క్యాచ్ పట్టడంతో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ ను కోల్పోయింది.

తొలి టెస్టు విజయోత్సాహంతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ అదే విధంగా రాణిస్తోంది. లంచ్ విరామానికి 76/0 స్కోరుతో దూసుకెళుతుంది.

కేప్ టౌన్ తొలి టెస్టులో కలిసి వచ్చినంతగా ఈ మ్యాచ్ లో భారత బౌలర్లకు కలిసి రావడం లేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెనలకు ఇప్పటికే 12 బౌండరీలను చేజార్చుకున్నారు.

తొలి పరాజయం అనంతరం భారీ పట్టుదలతో భారత్ రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మొదలైన మ్యాచ్ కు భారత్ టాస్ గెలుచుకుంది. దీంతో బ్యాటింగ్ ను ఎంచుకున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు మరికొద్ది నిమిషాల్లో క్రీజులోకి రానున్నారు.


టీమిండియా తన తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సాహా స్థానంలో పార్థీవ్‌ పటేల్‌, శిఖర్‌ ధావన్ స్థానంలో కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మకు చోటు దక్కింది. కాగా గాయం కారణంగా ఈ టెస్ట్‌కు స్టెయిన్‌ దూరంగా ఉన్నాడు. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు.
Story first published: Saturday, January 13, 2018, 17:13 [IST]
Other articles published on Jan 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X