
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్లో ఏడు పరుగులకే ఔటయ్యాడు.కేశవ్ మహారాజ్ బౌలింగ్లో స్లిప్లో డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
కేశవ్ మహారాజ్ బౌలింగ్లో స్లిప్లో డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.
ఓవర్నైట్ ఆటగాడు కేశవ్ మహరాజ్(9) అశ్విన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా పెవిలియన్కు చేరాడు. చివర్లో సఫారీ బౌలర్ ముత్తుసామి మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్లో అతడు 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
టెస్టుల్లో అశ్విన్ తానెంత విలువైన బౌలర్నో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ కెరీర్లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో ఇలా ఏడు వికెట్లను తీయడం అశ్విన్కు ఇది ఐదోసారి కావడం విశేషం. రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్కు వికెట్ దక్కింది.