పాక్తో మ్యాచ్.. షేక్హ్యాండ్ వివాదంపై తేల్చేసిన టీమిండియా కెప్టెన్!
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఉత్కంఠభరిత పోరులో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా సన్నద్ధమైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్ అంశం మరోసారి క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో మీడియా సమావేశంలో ఎదురైన ఊహించని ప్రశ్నకు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అత్యంత పరిణతితో, సూటిగా సమాధానమిచ్చింది.
హర్మన్ప్రీత్ స్ట్రాంగ్ కౌంటర్
ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఉద్రిక్తతలు, దౌత్యపరమైన విభేదాల కారణంగా గతంలో జరిగిన కొన్ని ఐసీసీ టోర్నమెంట్లలో భారత్-పాక్ ఆటగాళ్లు షేక్హ్యాండ్ చేసుకోకపోవడం సంచలనంగా మారింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారిణులు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అనే ప్రశ్నను మీడియా ప్రతినిధులు హర్మన్ప్రీత్ కౌర్ను అడిగారు. దానికి హర్మన్ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. "మేం ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. కాబట్టి మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా.. మరే ఇతర బయటి అంశాలపై మాట్లాడటానికి నేను ఇష్టపడను. నేను కూడా ప్రస్తుతం కేవలం మా ఆట తీరు వ్యూహాలపై దృష్టి పెట్టాను. టోర్నీలోని ఇతర జట్లతో ఎలా ఆడతామో.. పాకిస్థాన్తోనూ అలాగే తలపడతాం. స్టేడియంలో 100 శాతం శ్రమించి విజయం సాధించడమే మా ఏకైక లక్ష్యం" అని హర్మన్ ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది.

ఒత్తిడి ఉంది.. కానీ మేం అదృష్టవంతులం!
సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే ఆటగాళ్లపై ఉండే మానసిక ఒత్తిడి గురించి కూడా హర్మన్ప్రీత్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "మాపై ఒత్తిడి లేదని నేను అబద్ధం చెప్పను. భారత్-పాక్ మ్యాచ్ అంటే తప్పకుండా అపారమైన ఒత్తిడి ఉంటుంది. నేను చిన్నప్పుడు ఓ సాధారణ క్రికెట్ అభిమానిగా మ్యాచ్లు చూస్తున్నప్పుడే ఆ ఒత్తిడిని అనుభవించాను. ఇప్పుడు ఏకంగా స్టేడియంలోకి దిగి దేశం తరఫున ఆడుతున్నాం కాబట్టి మాపై ఇంకాస్త అదనపు ఒత్తిడి ఉండటం సహజం" అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. "కానీ, ఇలాంటి ఉత్కంఠభరిత, ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ల్లో ఆడే అవకాశం దక్కడం నిజంగా మా అదృష్టం. ఈ ఒత్తిడిని అధిగమించి, మైదానంలో ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూనే దేశానికి విజయాన్ని అందిస్తాం" అని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేసింది.
భారత్ గురి దానిపైనే..!
హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు ఈ వరల్డ్ కప్ లో ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదల ఉంది. అందువల్ల టోర్నీలో తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ జట్టును మట్టికరిపించి.. తమ విజయయాత్రను ఘనంగా ప్రారంభించాలని వ్యూహాలు రచిస్తోంది. గత రికార్డుల పరంగా టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications