
మార్చి, 2, 2014, ఢాకా - భారత్పై పాకిస్తాన్ వికెట్ తేడాతో విజయం
ఢాకా పిచ్ స్లో పిచ్ కావడంతో ఇరు జట్లలోని స్పిన్నర్లు ఈ మ్యాచ్లో చెలరేగారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలతో పాటు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా... 49వ ఓవర్ని భువనశ్వర్ కుమార్ వేశాడు. ఈ ఓవర్లో భువీ కేవలం మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 50వ ఓవర్ వేసేందుకు గాను బంతిని అశ్విన్ చేతికి ఇచ్చాడు.

తొలి బంతికే వికెట్ తీసిన అశ్విన్
తొలి బంతికే అశ్విన్ పాక్ బ్యాట్స్మన్ అజ్మల్ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో 7 బంతుల్లో కేవలం మూడు పరుగులు చేసిన పాక్ మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం భారత్దే అని అంతా భావించారు. అయితే, తర్వాతి బంతికి సింగిల్ తీయడంతో క్రీజులోకి షాహిద్ అఫ్రిది వచ్చాడు. అశ్విన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సుగా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మొదటే నేలకు తగలడంతో అంఫైర్ దానిని ఫోర్గా ఇచ్చాడు. ఆ తర్వాత బంతిని కూడా అఫ్రిది ఫోర్గా మలిచాడు. దీంతో లక్ష్యం చిన్నపోయింది. దీంతో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాధించింది.

మార్చి 18, 2012, ఢాకా - పాక్పై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నసిర్ జంషెడ్(112), మహమ్మద్ హఫీజ్(105) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. భారీ లక్ష్యం కావడం, దీనికి తోడు భారత బ్యాటింగ్లో గౌతం గంభీర్ రెండో బంతికి పెవిలియన్కు చేరడంతో ఈ మ్యాచ్లో గెలుపు మాదేనని పాకిస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అంతకముందు పాక్తో జరిగిన మ్యాచ్ల్లో 16, 18, 19 పరుగులే చేయడంతో విరాట్ కోహ్లీని పెద్దగా పాక్ బౌలర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 183 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

జూన్ 26, 2008 - కరాచీ - పాక్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షోయబ్ మాలిక్ 16 ఫోర్లు ఒక సిక్సుతో 125 పరుగులు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. అనంతరం 300 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ వికెట్ను ఆదిలోనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 95 బంతుల్లో 119 పరుగులతో సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సురేశ్ రైనా కూడా ఈ మ్యాచ్లో 69 బంతుల్లో 84 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 198 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ (48), ధోని (26 నాటౌట్) రాణించడంతో 42.1 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications
