
భారత్-పాక్ స్పెషల్ అట్రాక్షన్
రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్గా మాత్రమే చూడరు అభిమానులు. ఈ మ్యాచ్ ఫీవర్ అప్పుడే కమ్మేసింది కూడా.

భారత్-పాకిస్తాన్ మధ్య..
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. విజయం భారత్ వైపే మొగ్గు చూపుతుందనే అంచనాలూ ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. టీ20 ఫార్మట్లో పాకిస్తాన్పై భారత్దే పైచేయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు టీ20 మ్యాచ్లల్లో తలపడ్డాయి. ఇందులో ఏడుసార్లు భారత్ విజయఢంకా మోగించింది. రెండుసార్లు మాత్రమే విజయం పాకిస్తాన్ను వరించింది.
బాబర్ ఆజమ్తో ముచ్చట్లు..
ఈ పరిణామాల మధ్య రోహిత్ శర్మ- పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రెండు జట్లు ఇప్పటికే దుబాయ్కు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాయి. ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తోన్న సమయంలో ఈ ఇద్దరు కేప్టెన్లు ఎదురుపడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు గౌరవించుకున్నారు.


Click it and Unblock the Notifications
