న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో సారి భారత్ చేతుల్లో పాక్ చిత్తు

Asia cup 2018:Ind vs Pak | India Wins By 9 wickets
India vs Pakistan, Asia Cup 2018: Rohit, Shikhar hit tons as India record their biggest win over Pakistan

దుబాయి: ఆసియాకప్‌ 'సూపర్-4' మ్యాచుల్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిపోతోంది. సూపర్-4 మొదటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై సునాయాసంగా గెలిచిన భారత్.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ జోరు పెంచుతూ ప్రత్యర్థుల పని పడుతోంది. ఇప్పటికే గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్‌.. సూపర్‌-4లో ఆదివారం 9 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది.

50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే

50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే

కెప్టెన్ రోహిత్ శర్మ 111 పరుగులతో (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ), శిఖర్ థవన్ 114 ( 100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో వీరవిహారం చేశారు. పాక్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. మొదట జస్‌ప్రీత్‌ బుమ్రా (2/29), యుజ్వేంద్ర చాహల్‌ (2/46), కుల్దీప్‌ యాదవ్‌ (2/41) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది.

39.3 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి

39.3 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి

షోయబ్‌ మాలిక్‌ (78) 90 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సులు, సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (44) 66 బంతుల్లో 2ఫోర్లతో రాణించారు. అనంతరం శిఖర్‌ ధావన్‌ (114) 100 బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సులు, రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌) 119 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సులతొ సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 39.3 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. భారత్‌ ఫైనల్‌ చేరడం లాంఛనమే.

అలవోకగా ఎదుర్కొంటూ సెంచరీలు

అలవోకగా ఎదుర్కొంటూ సెంచరీలు

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ పాక్‌ బౌలింగ్‌లొ దంచేశారు. గల్లీ బౌలర్లను ఆడినట్లు వారిని అలవోకగా ఎదుర్కొంటూ సెంచరీలు సాధించారు. ప్రత్యర్థి ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా కలిసి రావడంతో వీరికి ఎదురే లేకపోయింది. మొదట బౌలర్లు చక్కటి ప్రదర్శనతో పాక్‌ను కట్టడి చేశారు. సూపర్‌-4లో రెండు భారీ విజయాలతో భారత్‌ దాదాపుగా ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

 రెండు విజయాలతో దాదాపుగా ఫైనల్‌

రెండు విజయాలతో దాదాపుగా ఫైనల్‌

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు జస్‌ప్రీత్‌ బుమ్రా (2/29), యుజ్వేంద్ర చాహల్‌ (2/46), కుల్దీప్‌ యాదవ్‌ (2/41) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది. టీమిండియా మంగళవారం (సెప్టెంబరు 25) తన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. సూపర్‌-4లో రెండు భారీ విజయాలతో భారత్‌ దాదాపుగా ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. రెండో బెర్తు కోసం మిగతా జట్లు పోటీ పడాలి.

1
44054
Story first published: Monday, September 24, 2018, 9:21 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X