చివరి మ్యాచ్లో రెండు సిక్స్లు
కాగా, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లో రెండు సిక్స్లు బాదిన రోహిత్ శర్మ.. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా ధోనీ (215 సిక్స్లు) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన టీమిండియా 12 మ్యాచుల్లో గెలవగా.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడింది.
మూడో టీ20లో గెలిపిస్తే
ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే మూడో టీ20లో గెలిపిస్తే.. భారత్ తరఫున మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో రెండోస్థానానికి రోహిత్ శర్మ చేరనున్నాడు. ఈ జాబితాలో ధోనీ (72 మ్యాచుల్లో 41 విజయాలు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లీతో (20 మ్యాచుల్లో 12 విజయాలు) కలిసి రోహిత్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ
మూడో టీ20 నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "తొలి టీ20లో జరిగిన తప్పుల్ని సమీక్షించుకున్నాం. హామిల్టన్లో పోరు రసవత్తరంగా సాగుతుంది. మేం సుదీర్ఘ కాలంగా పర్యటనలో ఉన్నాం. కాబట్టి కుర్రాళ్లపై ఎక్కువ ఒత్తిడి పెంచదలుచుకోలేదు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా మైదానంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆడాలి" అని అన్నాడు.