వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలనుపరిశీలిస్తే!
* సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ (భారత్) - 21 సెంచరీల భాగస్వామ్యం
* ఆడమ్ గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) - 16
* గార్డెన్- హేన్స్ (వెస్టిండీస్) - 15
* రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ (భారత్) - 14
|
400 వికెట్ల క్లబ్లో ట్రెంట్ బౌల్ట్
మరోవైపు కివీస్ పేసర్ ఈ మ్యాచ్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరుపున మూడు ఫార్మాట్లలో కలిసి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్(66)ను ఔట్ చేయడం ద్వారా బౌల్ట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. న్యూజిలాండ్ తరుపున ఈ జాబితాలో అగ్రస్థానంలో డానియేల్ వెటోరి(696), రిచర్డ్ హ్యాడ్లీ(589), టిమ్ సౌథీ(480), క్రిస్ కెయిన్స్(419)లు ఉన్నారు.
టీమిండియా
ప్రస్తుతం 46 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. క్రీజులో ధోని(23 నాటౌట్), కేదార్ జాదవ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. అంతకముందు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66), విరాట్ కోహ్లీ(43), అంబటి రాయిడు(47) పరుగులు చేసి పెవిలియన్కు చేరారు.