
మూడు సార్లు మాత్రమే
2004, డిసెంబరు 23న భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తుది జట్టులో లేకుండా బెంచ్పై కూర్చోవడం ఇది మూడోసారి కాగా 2013 తర్వాత ఇదే తొలిసారి. 12 ఏళ్ల క్రితం అంటే 2007లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లకి జ్వరం కారణంగా తుది జట్టులో ధోనీ చోటు కోల్పోయాడు.

తొడ కండరాల గాయం కారణంగా
ఆ తర్వాత మళ్లీ 2013లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో మూడు వన్డేలకి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా మళ్లీ అదే గాయంతో సోమవారం న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో తుది జట్టులో ధోని చోటుని కోల్పోయాడు. గతేడాది పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోని, ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్లోకి వచ్చాడు.

కంగారులో ధోని అభిమానులు
ప్రస్తుతం న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో సైతం ధోని అటు వికెట్ కీపర్గా, ఇటు బ్యాట్స్మెన్గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే, తాజాగా మూడో వన్డేలో ధోని గాయం కారణంగా తుది జట్టులో చోటు కోల్పోవడం... వరల్డ్కప్ ముంగిట ధోని అభిమానులను కంగారులోకి నెట్టింది.


Click it and Unblock the Notifications

