తుది జట్టులో హార్ధిక్ పాండ్యా
ఇటీవల బీసీసీఐ పాలకుల కమిటీ హార్దిక్ పాండ్యాపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్ని 157 పరుగులకే కుప్పకూల్చి 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా.. మౌంట్ మాంగనుయ్లో జరిగిన రెండో వన్డేలోనూ 234కే ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో గెలుపొందింది.
2-0 ఆధిక్యంలో టీమిండియా
దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు ఈ సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా సెలక్టర్లు మిగిలిన రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
జట్ల వివరాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, మహమ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్.
కివీస్ జట్టు: మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హన్రీ నికోల్స్, మిచెల్, బ్రాస్వెల్, ఇష్ సోధీ, లాకీ, ట్రెంట్ బౌల్ట్.


Click it and Unblock the Notifications












