కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్
గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశ్రాంతి ఇచ్చినట్లు సెలెక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్తో నిరాశపరుస్తోన్న కేఎల్ రాహుల్ని న్యూజిలాండ్ పర్యటన కోసం తొలుత సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
కోహ్లీకి విశ్రాంతి
అయితే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి వన్డే ముగిసిన తర్వాత కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు ఆకస్మికంగా నిర్ణయించడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్కి అవకాశమివ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. గత కొంతకాలంగా టెస్టుల్లో ఓపెనర్గా వన్డే, టీ20ల్లో మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
శనివారం రెండో వన్డే
శనివారం జట్టుతో కలవనున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య శనివారం ఉదయం 7.30 గంటలకు రెండో వన్డే మౌంట్ మాంగనుయ్లోని బే ఓవల్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ భారత్-ఏ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో భారత్-ఏ జట్టు ఐదు వన్డేలు ఆడనుంది.