అంఫైర్ మాట్లాడుతూ
అంఫైర్ మాట్లాడుతూ "ఇలా జరగడం చాలా దురదృష్టకరం. గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. కానీ గత 48 గంటలుగా వాతావరణం ప్రతీకూలంగా ఉండటంతో వాళ్ల కష్టం వృధా అయింది. వాతావరణం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కానీ, ఆదివారం భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కి వాతావరణం అనుకూలించాలని కోరుకుంటున్నాం" అని అన్నాడు.
వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది
ఈ వరల్డ్కప్లో వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది. అందులో రెండు శ్రీలంక మ్యాచ్లే కావడం విశేషం. బ్రిస్టల్లో శ్రీలంకతో పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. సోమవారం దక్షిణాఫ్రికా-విండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 7.3 ఓవర్ల అనంతరం వర్షం ఆటంకం కలిగించింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన దక్షిణాఫ్రికా.. సోమవారం విండీస్తో మ్యాచ్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో
ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. నాలుగు మ్యాచ్లాడిన దక్షిణాఫ్రికా ఒక పాయింటుతో ఖాతా తెరిచింది. తాజాగా, మంగళవారం బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. ఈ వరల్డ్కప్లో వర్షం కారణంగా మ్యాచ్ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లపై పడింది.

5 పాయింట్లతో మూడో స్థానంలో భారత్
దీంతో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు టీమిండియా 5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ వరల్డ్కప్లో కోహ్లీసేన అజేయంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భారత్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మీద గెలిచిన భారత్ గురువారం న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది.

జూన్ 16న పాకిస్థాన్తో మ్యాచ్
అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 16న తదుపరి మ్యాచ్లో దాయాది దేశమైన పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్పైనే నెలకొంది.


Click it and Unblock the Notifications












