141 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్
దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 141 పరుగుల వద్ద రోహిత్ శర్మ నాలుగో వికెట్గా ఔటైన కొద్దిసేపటికే హార్దిక్, ధోని(2)లు కూడా నిష్ర్రమించడంతో స్కోరులో వేగం తగ్గింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(28: 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(21: 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)లు రాణించారు.
కొలిన్ మున్రోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
చివర్లో దినేశ్ కార్తీక్(33 నాటౌట్; 16 బంతుల్లో 4 సిక్సర్లు) చెలరేగి ఆడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్, శాంటర్న్ చెరో రెండు వికెట్లు తీసుకోగా... టిక్నర్, స్కాట్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి టీ20లో 72 పరుగులతో రాణించిన కొలిన్ మున్రోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
భారత టార్గెట్ 213
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్ మున్రో (72: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు.
తొలి వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం
వీరిద్దరూ తొలి వికెట్కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్తో కలిసి మున్రో స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు.
మూడో వికెట్గా విలియమ్సన్ ఔట్
ఆ తర్వాత మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్(27) కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్ జట్టు స్కోరు 150 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రాండ్హోమ్(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డార్లీ మిచెల్(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు), రాస్ టేలర్(14 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫరవాలేదనిపించారు.
రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
ముఖ్యంగా చివర్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించారు. భారత బౌలర్లలో చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (2/26) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓపెనర్లు మున్రో, సీఫర్ట్ వికెట్లను పడగొట్టాడు. ఇక, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్లకు తలో వికెట్ తీసుకున్నారు.