అయ్యర్ అరుదైన రికార్డు:
అర్ధ సెంచరీ సాధించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 10 కన్నా ఎక్కువ మ్యాచ్లలో అత్యధిక హాఫ్ సెంచరీల సగటు సాధించిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 16 మ్యాచ్లు ఆడిన అయ్యర్ 9 అర్ధ సెంచరీలు చేశాడు. ఫలితంగా అత్యధిక హాఫ్ సెంచరీల సగటు 56.25 సగటు నమోదు చేశాడు.
చాపెల్ 16 మ్యాచ్లలో 8:
శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాల్లో ఇయాన్ చాపెల్ 16 మ్యాచ్లలో 8, ఆకిబ్ ఇలియాస్ 10 మ్యాచ్లలో 5 హాఫ్ సెంచరీలు (సగటు 50)తో ఉన్నారు. అన్షుమన్ రథ్ 18 మ్యాచ్లలో 8 -సగటు 44.44, డేర్ డస్సన్ 16 మ్యాచ్లలో 7 -సగటు 43.75, టెన్ డోషెట్ 32 మ్యాచ్లలో14 -సగటు 43.75తో మిగతా స్థానాల్లో ఉన్నారు.
రెండో బ్యాట్స్మెన్గా రాహుల్ రికార్డు:
సెంచరీ చేయడంతో కేఎల్ రాహుల్ కూడా ఓ రికార్డును నమోదు చేశాడు. కివీస్ గడ్డపై 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. 2015 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా (110) సెంచరీ చేసి తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.
వీరి భాగస్వామ్యమే హైలెట్:
ఆరంభంలో భారత్ను గట్టి దెబ్బ కొట్టిన న్యూజిలాండ్ బౌలర్లు మధ్య ఓవర్లలో బ్యాట్స్మెన్ జోరును అడ్డుకోలేకపోయారు. భారత ఇన్నింగ్స్లో రాహుల్, శ్రేయస్ భాగస్వామ్యమే హైలెట్. 62/3తో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేసారు. ఈ జోడి నాలుగో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.