తొలి టీ20లో భారత్ విఫలం
తొలి టీ20లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కోహ్లీ స్థానంలో మూడో స్థానంలో బరిలోకి దిగిన ఆల్రౌండర్ విజయ్ శంకర్ 18 బంతుల్లో 27 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, చివరి రెండు వన్డేల్లో చోటు దక్కించుకున్న శుభమన్ గిల్కు రెండో టీ20లో చోటు దక్కడం కష్టమే.
పంత్ రాకతో బలంగా మిడిలార్డర్
న్యూజిలాండ్తో వన్డే సిరిస్కు దూరమైన రిషబ్ పంత్... టీ20 సిరిస్లో చోటు దక్కించుకోవడంపై మిడిలార్డర్ బలంగా ఉంది. అయితే, తొలి టీ20లో ఆశించిన స్థాయిలో పంత్ రాణించలేదు. తొలి టీ20లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలు పేలవ ప్రదర్శనతో పెవిలియన్కు చేరారు. తొలి టీ20లో ధోనికి దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే.
భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు
మరోవైపు తొలి టీ20లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్తో పాటు ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్తో సహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్లు విజృంభించడంతో తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 219 పరుగులు చేసింది.
తొలి టీ20లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి కివీస్
దీంతో రెండో టీ20లో ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్లో ఎవరో ఒకరికి చోటు దక్కనుంది. మరోవైపు కృనాల్ పాండ్యా, చాహల్ ఫరవాలేదనిపించారు. దీంతో వీరిస్థానానికి ఎటువంటి ఢోకా లేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు వన్డే సిరిస్ను చేజార్చుకున్నప్పటికీ... తొలి టీ20లో గెలిచిన ఉత్సాహాంతో బరిలోకి దిగుతుంది.
దూకుడుగా కివీస్ ఓపెనర్లు
ముఖ్యంగా ఓపెనర్లు దూకుడుగా ఆడటం ఆజట్టుకు కలిసొచ్చే అంశం. బ్యాట్స్మెన్లకు తోడు బౌలర్లు సైతం రాణించడంతో తొలి టీ20లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సొంత గడ్డపై కివీస్ బౌలర్లు ఇష్ సోధి, శాంట్నర్ సైతం భారత బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టకుండా కట్టడి చేశారు.
మ్యాచ్ ప్రసారం
స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్లో మ్యాచ్ 11.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం.
హాట్ స్టార్లో లైవ్ స్ట్రీమింగ్