
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉందని తొలుత భావించినా, గత జట్టునే కొనసాగించేందుకు భారత్ మొగ్గుచూపింది.
మరోవైపు కివీస్ కూడా టీమ్లో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 80 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా... ఈ మూడు టీ20ల సిరీస్లో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇటీవల సొంతగడ్డపై 1-4 తేడాతో వన్డే సిరీస్ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఈ మ్యాచ్లో విజయం సాధించి 2-0తో టీ20 సిరీస్ని కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది.
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టీమ్ సీఫెర్ట్, కొలిన్ మున్రో, డార్లీ మిచెల్, రాస్ టేలర్, కొలిన్ గ్రాండ్ హోమ్, మిచెల్ సాన్ట్నర్,కుగ్లీన్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ఫెర్గూసన్