రెండో ట్వంటీ 20లో భారత్ విజయం: 1-1తో సిరీస్ సమానం


అక్లాండ్: రెండో ట్వంటీ 20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పైన ఏడు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. అంతకుముందు ఆతిథ్య న్యూజిలాండ్ 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ - న్యూజిలాండ్ 1-1తో సమానంగా ఉన్నాయి. థర్డ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
ఆక్లాండ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియాకు ఆతిథ్య జట్టు 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
గత బుధవారం ముగిసిన తొలి టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లు రెండో టీ20లో మాత్రం న్యూజిలాండ్ జట్టుని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు, ఖలీల్ అహ్మద్ రెండు, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications