ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసి.. టీమిండియా ముందు 133 పరుగుల స్వల్ప స్కోరును ఉంచింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (33), కొలిన్ మున్రో (26), టిమ్ సీఫెర్ట్ (33)లు పరుగులు చేసారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసాడు. శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
{photo-feature}