For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యర్ వీరవిహారం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం!!

IND VS NZ 2020,1st T20I Highlights : India Defeated New Zealand By 6 Wickets || Oneindia Telugu
India vs New Zealand 1st T20I: KL Rahul, Shreyas Iyer star as India hunt down 204

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదటగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (56), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) చెలరేగగా.. ఇన్నింగ్స్ చివరలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (58) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో టీమిండియా భారీ లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో ఇష్ సోధి రెండు వికెట్లు సాధించాడు.

చెలరేగిన రాహుల్:

చెలరేగిన రాహుల్:

204 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) త్వరగానే పెవిలియన్ చేరాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. ఆపై లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ అండతో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా బౌండరీలు, సిక్సులు బాదుతూ వేగంగా పరుగులు చేసాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

కోహ్లీ కమాల్:

కోహ్లీ కమాల్:

లక్ష్యం పెద్దది కావడంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. కోహ్లీతో కలిసి రాహుల్ 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు కోహ్లీ కూడా తన మార్క్ ఆటతో అలరించాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లలో వేగంగా పరుగులు చేసాడు. కొద్దిసేపటికే కోహ్లీ (49) కూడా క్యాచ్ ఔట్ రూపంలో నిష్క్రమించాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయ్యర్‌ వీరవిహారం:

అయ్యర్‌ వీరవిహారం:

శ్రేయాస్ అయ్యర్‌కు జత కలిసిన శివమ్ దూబే (13) ఓ సిక్స్, ఫోర్ కొట్టి కొద్దిగా ఒత్తిడి తగ్గించాడు. అయితే భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అయ్యర్‌ కివీస్ బౌలర్లపై విరుచుకుపడి వీరవిహారం చేసాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. మనీష్ పాండే (14)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆక్లాండ్ వేదికనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

మున్రో మాయ:

మున్రో మాయ:

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేయగా.. కోలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, శివం దూబే, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.

1
46203
Story first published: Friday, January 24, 2020, 18:23 [IST]
Other articles published on Jan 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+