భారత్కు పరుగుల పరంగా భారీ ఓటమి
భారత్ ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ టీ20ల్లో ఈ మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో ఓడిన చెత్త రికార్డును నమోదు చేసింది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు ఆ రికార్డుని 80 పరుగులతో ఓడి టీమిండియా అధిగమించింది.
టీ20ల్లో 200
టీ20ల్లో 200కు పైగా పరుగులను భారత జట్టు కేవలం రెండు సార్లు మాత్రమ్ చేధించింది. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 207 పరుగుల లక్ష్యాన్ని చేధించగా... 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 202 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది.
టీ20ల్లో టీమిండియా ఎక్కువసార్లు ఓడింది కివీస్ చేతిలోనే
టీ20ల్లో టీమిండియా ఎక్కువసార్లు ఓడింది న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చేతిలోనే కావడం విశేషం. న్యూజిలాండ్, ఇంగ్లాండ్లతో జరిగిన టీ20 మ్యాచ్ల్లో టీమిండియా 7 సార్లు ఓడిపోగా... ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(6 సార్లు) ఉంది.


Click it and Unblock the Notifications













