'నైపుణ్యాలపై దృష్టి పెడుతాం.. మ్యాచ్లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం'
గప్టిల్ ధాటిగా ఆడితే.. మున్రో వీరవిహారం చేసాడు. ఇద్దరూ బ్యాట్ జుళిపిస్తూ తొలి వికెట్కు 80 పరుగులు జోడించారు. అయితే గప్టిల్ భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. గప్టిల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. శివం దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్ డీప్ స్వేర్ లెగ్పై భారీ షాట్ కొట్టగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్కే హైలెట్ అయ్యింది.
గప్టిల్ పెవిలియన్ చేరినా.. మున్రో దూకుడు మాత్రం తగ్గలేదు. బౌండరీలు కొడుతూ.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మున్రో 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 రన్స్ చేసాడు. ఆ వెంటనే భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్హోమ్ డకౌట్ అయ్యాడు. అయితే రాస్ టేలర్ అండతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే 4 సిక్సులు బాదాడు. మరోవైపు టేలర్ కూడా బ్యాట్ జుళిపిస్తున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (31), కేన్ విలియమ్సన్ (39)లు ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీలింగ్ తీసుకుంది. దాంతో కివీస్ ఇన్నింగ్స్ను ఆరంభించింది. తొలి టీ20 మ్యాచ్లో కీపర్ బాధ్యతలు లోకేష్ రాహుల్ చేపట్టాడు. దీంతో స్పెషలిస్టు కీపర్లు సంజూ శాంసన్, రిషభ్ పంత్లకు బెంచ్కే పరిమితం అయ్యారు. భారత్ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది.