న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా Vs ఇంగ్లాండ్: ఇంగ్లాండ్‌పై భారత్‌దే పైచేయి

By Nageshwara Rao
India vs England: Team Composition on India’s Mind as Blockbuster Series Kicks Off

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభమైంది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్‌కు ఈ టెస్టు మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుకు 1000వ టెస్టు.

1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది. ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు పూర్తి చేసింది. ఇందులో 357 టెస్టులు గెలువగా, 297 మ్యాచ్‌ల్లో ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్టుతో టెస్టు క్రికెట్ చరిత్రలో 1000 టెస్ట్‌లు ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో భారత్‌ 57 టెస్టులాడగా, అందులో భారత్‌ గెలిచింది కేవలం ఆరు మాత్రమే. 30 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ గెలవగా, 21 డ్రాగా ముగిశాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఇరు జట్లు టెస్టుల్లో 117సార్లు తలపడగా, ఇంగ్లాండ్‌ 43 గెలిస్తే, భారత్‌ 25సార్లు విజయం సాధించింది. 49 మ్యాచ్‌లు డ్రాతో సరిపెట్టుకుంది.

అయితే గెలుపుఓటమలను పక్కన పెడితే.. రికార్డుల పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్‌పై భారత్‌దే పైచేయి. దీనిలో భాగంగా ఇప్పటివరకూ అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ పేరిట రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇన్ని టెస్టులు జరగ్గా, అందులో గవాస్కర్‌ అత్యధికంగా 38మ్యాచ్‌లాడాడు.

* ఇంగ్లీషు గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (2535) జాబితాలో ముందున్నాడు.

* ప్రస్తుతం అత్యధిక పరుగులు సాధించే అవకాశం ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అలెస్టర్‌ కుక్‌(2104) మాత్రమే ఉంది. మరో 432 పరుగులు చేస్తే అతను సచిన్‌ రికార్డును అధిగమిస్తాడు.

* సెంచరీల పరంగా చూస్తే సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ చెరో ఏడు సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు.

* బౌలింగ్‌ విషయానికొస్తే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బీఎస్‌ చంద్రశేఖర్‌(95) ఉన్నాడు. ఇందులో ఎనిమిదిసార్లు చంద్రశేఖర్‌ ఐదు వికెట్లు తీశాడు.

* వికెట్‌కీపర్‌గా ఎక్కువ మందిని వెనక్కి పంపిన రికార్డు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ(67) పేరిట ఉంది. మరో మాజీ వికెట్‌కీపర్‌ కిర్మాణీ అత్యధికంగా 11స్టంప్‌ ఔట్‌లు చేశాడు.

* మరోవైపు బౌలింగ్‌ విషయంలో జేమ్స్ అండర్సన్‌(85) మాత్రమే చంద్రశేఖర్‌ రికార్డును అధిగమించగలడు. మరో 11వికెట్లు తీస్తే అతను చంద్రశేఖర్‌ రికార్డు అధిగమిస్తాడు.

Story first published: Wednesday, August 1, 2018, 19:10 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X