Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టీమిండియా ఘోర ఓటమి.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్!

IND vs ENG: టీ20 ప్రపంచ కప్ 2026 ఛాంపియన్ అయిన టీమిండియా ప్రస్తుతం చాలా క్లిష్టమైన దశలో ఉంది. ముందుగా ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జులై 9న(గురువారం) బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ అవమానకర పరాజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లోని చివరి(ఐదో టీ20) మ్యాచ్ శనివారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది. ఇక్కడ టీమిండియా తన పరువును కాపాడుకునేందుకు ప్రయత్నించనుంది.

కాంగ్రెస్ ఎంపీ ఫైర్
టీమిండియా ఈ ఘోర పరాజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా భారత జట్టుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ.. "నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నేను షాక్ అయ్యాను. ఈ అవమానం భరించలేనది. ఇక్కడ చెప్పడానికి ఇంకేమీ లేదు" అంటూ శశిథరూర్ వాపోయారు. శశిథరూర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరాశలో ఉన్న టీమిండియా అభిమానులు ఆయనతో ఏకీభవించి.. రకరకాలుగా పోస్టులు చేస్తున్నారు.

India vs England T20 Series Congress MP Shashi Tharoor Reaction about Team India Loss Details

ఓ పీడకలలా సాగిన మ్యాచ్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(80) మినహా టీమిండియా టాపార్డర్ పూర్తిగా పరాజయం పాలైంది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ శ్రేయస్ అయ్యర్ జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను చిత్తు చేశారు. ఫిల్ సాల్ట్(59 నాటౌట్), కెప్టెన్ హ్యారీ బ్రూక్(79 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తలెత్తుతున్న ప్రశ్నలు
ఈ ఓటమి టీమిండియాకు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ప్రపంచకప్ గెలిచిన 4 నెలల్లోనే ఆ జట్టు పూర్తిగా పతనమైంది. 2019 తర్వాత భారత్ వరుసగా రెండు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను కోల్పోవడం ఇదే తొలిసారి. నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా పరుగులు చేస్తున్నాడు. కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇతర ప్లేయర్ల ప్రదర్శన చాలా నిరాశపరిచింది.

Story first published: Friday, July 10, 2026, 13:25 [IST]
Other articles published on Jul 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+