హైదరాబాద్: అప్పటిదాకా ఎదుర్కొంటున్న విమర్శలన్నింటినీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒక్క సెంచరీతో తుడిచిపెట్టేశాడు రోహిత్ శర్మ. ఆదివారం ఇంగ్లాండ్తో తలపడిన టీమిండియా నిర్ణయాత్మక మ్యాచ్లో తీవ్రంగా శ్రమించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన మ్యాచ్ చివరి వరకూ క్రీజులో పాతుకుపోయి జట్టును నిలబడడు. ఇలా టీ20 సిరీస్ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో మంచి శుభారంభం చేసింది.
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో రోహిత్ సాధించిన సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
Yesterday’s innings is dedicated to my fallen friend Sudan 🦏 May we find a way to make this world a better place for all of us. pic.twitter.com/wayEjDlUyA
— Rohit Sharma (@ImRo45) July 9, 2018
మ్యాచ్ జరిగిన తర్వాతి రోజు సోమవారం ట్విటర్లో ' నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు.
WE FAILED SUDAN & ALL THE OTHER NORTHERN WHITE RHINOS!
— Kevin Pietersen (@KP24) March 20, 2018
No males males left!
Animal lovers, it’s time to go to work to save ALL other rhinos! #RIPSudan 🦏 pic.twitter.com/JQW8BzfZMw
'మనమంతా సూడాన్ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్ అన్నిటిని రక్షిద్దాం.' అని పిలుపునిచ్చాడు. శతకంతో ఆకట్టుకున్న రోహిత్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ జూలై 12న ప్రారంభం కానుంది.