మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్
ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి చేసిన పరుగులు 158. ఇందులో ధావన్ అత్యధిక స్కోరు 44. ఇక కేఎల్ రాహుల్ కూడా మూడు టెస్టుల్లో చేసిన పరుగులు 96కాగా.. అత్యధిక స్కోరు 36గా ఉంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 26కాగా.. అత్యధిక స్కోరు 20.
ముగ్గురు ఓపెనర్లు ఈ సిరిస్లో ఘోరంగా విఫలం
ఇలా, ఈ ముగ్గురు ఓపెనర్లు ఈ సిరిస్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే ఆఖరి టెస్టులో రాహుల్ స్థానంలో పృథ్వీ షాకు చోటుదక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చివరి టెస్టులో యువ ఓపెనర్ పృధ్వీ షాతో ఒక ప్రయోగం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోందట.
పృధ్వీ షాకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది?
ఇప్పటికే సిరీస్ 1-3తో చేజారిన నేపథ్యంలో.. నామమాత్రమైన ఈ టెస్టుకి పృధ్వీ షాకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? అనేదానిపై జట్టులో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఖరి టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా బరిలోకి దిగే అవకాశం ఉంది. తుంటి గాయం కారణంగా మూడో టెస్టులో అశ్విన్ ఇబ్బందిపడ్డాడు.
|
శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు
అయితే, సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు నాటికి కోలుకోవడంతో అతడికి తుది జట్టులో కల్పించారు. అయినా, నాలుగో టెస్టులో అశ్విన్ తన బౌలింగ్తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.