For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ టెస్టు: లంచ్ విరామానికి భారత్ 194/2, ఆధిక్యం 362

By Nageshwara Rao
India vs England, Live Cricket Score, 3rd Test Day 3 at Trent Bridge: Kohli & Pujara Take India to 194/2 at Lunch, Lead by 362

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పట్టు బిగించింది. మూడో రోజైన సోమవారం ఓవర్‌ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు.. లంచ్ విరామ సమయానికి 60 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ (56 బ్యాటింగ్), పుజారా (54 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇంగ్లాండ్‌పై 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించారు.

1
42376

పదేపదే ఇంగ్లండ్‌ సారథి జోయ్‌ రూట్‌ బౌలింగ్‌ మారుస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. వికెట్‌ని కాపాడుకుంటూ.. ఆధిక్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఫామ్‌లో లేక నానాతంటాలు పడుతున్న పుజారా తిరిగి మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.

ఈ క్రమంలో 147 బంతులు ఆడిన పుజారా 7 ఫోర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కొంత సమాయానికే కోహ్లీ 82 బంతుల్లో 5 ఫోర్లతో తన టెస్ట్‌ కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో మూడో టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకపోతోంది.

Story first published: Monday, August 20, 2018, 18:28 [IST]
Other articles published on Aug 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+