
1-1తో సిరిస్ సమం
మూడు టీ20ల సిరిస్లో భాగంగా కాన్పూర్లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే, నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 చివరి ఓవర్లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో చివరిదైన మూడో టీ20 ఆసక్తికరంగా మారింది. మూడో టీ20లో విజయం సాధించి సిరిస్ను గెలుచుకోవాలని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తోంది.

టీ20 సిరిస్ను గెలవాలనే పట్టుదలలో ఇంగ్లాండ్
టెస్టు, వన్డే సిరిస్ ఓటమి పరాభవాన్ని మరచిపోవాలంటే టీ20 సిరిస్ను గెలుచుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లాండ్తో చివరి టీ20 కెప్టెన్ కోహ్లీకి ఓ పరీక్షగానే క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ బాద్యతలను స్వీకరించిన తర్వాత ఏ ఫార్మాట్లోనైనా సొంత గడ్డపై కోహ్లి సిరీస్ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో సిరీస్లో ఓటమి అన్నదే లేని రికార్డును కోహ్లీ నిలబెట్టుకుంటాడా? లేదా చూడాలి.

చిన్నసామి స్టేడియంలో భారత్ రికార్డు 1-1
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరగ్గా, అందులో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. ఆ రెండు మ్యాచ్ల్లో భారత్ ఒక మ్యాచ్లో ఓటమి పాలుకాగా, మరొక మ్యాచ్లో విజయం సాధించింది. గతేడాది మార్చి 23వ తేదీన బంగ్లాతో భారత్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది.
ధోని నుంచి బ్యాటింగ్ టిప్స్
బుధవారం ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టీ20 సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి బ్యాటింగ్ టిప్స్ అడిగి తెలుసుకుంటున్న సురేశ్ రైనా.


Click it and Unblock the Notifications











