Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చేతికి నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపకోలేరు!

IND vs ENG: లార్డ్స్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి నిర్ణయాత్మక వన్డేను ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నల్లటి ఆర్మ్‌బ్యాండ్‌లను ధరించారు. భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా నల్లటి ఆర్మ్‌బ్యాండ్‌లను ధరించారు. కరేబియన్ దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్‌కు నివాళులర్పించేందుకు ఇరు జట్లు ఇలా చేశాయి.

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

మ్యాచ్ కు ముందు నిమిషం పాటు మౌనం
లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదివారం లార్డ్స్‌లో ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఒక నిమిషం పాటు మౌనం పాటించాయి. "శుక్రవారం వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ మృతికి నివాళిగా టీమిండియా నల్లటి ఆర్మ్‌బ్యాండ్‌లను ధరించింది" అని రాస్తూ బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.

India vs England 3rd ODI Why India and England Players Wearing Black Armbands at Lords out of Respect

మ్యాచ్ గెలిచిన జట్టుదే సిరీస్
లార్డ్స్‌లో జరిగే వన్డే ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. లార్డ్స్‌లో జరిగే వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. భారత జట్టు తుది జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో పాటు, వాషింగ్టన్ సుందర్, శివమ్ దుబే ఆడటం లేదు. వారి స్థానంలో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశం లభించింది.

IND vs ZIM: గంభీర్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్.. కొత్త కోచ్ ఎవరంటే?

IND vs ZIM: గంభీర్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్.. కొత్త కోచ్ ఎవరంటే?

భారత జట్టు రోహిత్ శర్మ ప్రదర్శనను నిశితంగా గమనిస్తుంది. ఈ సిరీస్‌లోని గత రెండు మ్యాచ్‌లలో రోహిత్ పెద్ద స్కోరు చేయలేకపోయాడు. మరోవైపు, గత రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన జో రూట్‌ను కట్టడి చేయడం భారత బౌలర్లకు సవాలుగా నిలుస్తుంది. రెండో వన్డేలో రూట్ సాధించిన అజేయ 99 పరుగులు ఇంగ్లండ్‌ను విజయపథంలో నడిపించాయి.

Story first published: Sunday, July 19, 2026, 17:29 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+