Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బుమ్రా లేకుంటే.. అంతా ఉత్తదే!

IND vs ENG: లార్డ్స్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. మోకాలి గాయం కారణంగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమవ్వగా.. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఆరంభంలో వరుసగా రెండు మెయిడన్ ఓవర్లు, 20 డాట్ బాల్స్‌తో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అతనికి మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు.

అతని సలహా‌తోనే రోహిత్‌ను ఔట్ చేశాం.. మ్యాచ్ గెలిచాం: హ్యారీ బ్రూక్

అతని సలహా‌తోనే రోహిత్‌ను ఔట్ చేశాం.. మ్యాచ్ గెలిచాం: హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ ఓపెనర్లు జాకబ్ బెథెల్, బెన్ డకెట్ మొదట జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి.. ఆ తర్వాత భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో కొన్ని ముఖ్యమైన రికార్డులను నెలకొల్పింది. ఓ వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ జట్టుకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా.. ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం. బెన్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. జాకబ్ బెథెల్ 91 పరుగులు చేశాడు.

India vs England 3rd ODI Jasprit Bumrah Absence and Poor Bowling Costs India at Lords Stadium

టీమిండియా బౌలర్లు చెత్తగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్ఫించుకున్నారు. భారత జట్టు 16 వైడ్లు, 9 లెగ్ బైలు, ఒక నో-బాల్‌తో సహా మొత్తం 26 అదనపు పరుగులు ఇచ్చింది. యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తొలి ఓవర్లోనే 11 పరుగులు ఇచ్చాడు. కామెంటరీలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్, "ఇదే భారత బౌలింగ్ సారం" అని అన్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా భారత బౌలింగ్‌ను చాలా సాధారణంగా ఉందని అభివర్ణించారు.

రోహిత్ రిటైర్మెంట్.. తేల్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!

రోహిత్ రిటైర్మెంట్.. తేల్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!

ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఇది లార్డ్స్‌లో అత్యధిక వన్డే స్కోరు. జో రూట్ కూడా భారత్ కష్టాలను మరింత పెంచాడు. కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 74 పరుగులు చేశాడు. వన్డేలలో ఇది జో రూట్‌కు వరుసగా ఆరో యాభైకి పైగా స్కోరు. ఈ సిరీస్ మొత్తంలో భారత బౌలర్లు జో రూట్‌ను ఔట్ చేయలేకపోయారు. జో రూట్ 3 ఇన్నింగ్స్‌లలో 249 పరుగులు చేశాడు.

లార్డ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీసినప్పటికీ.. 69 పరుగులు కూడా ఇచ్చేశాడు. గుర్నూర్ బ్రార్ (97 పరుగులు), ప్రిన్స్ యాదవ్ (79 పరుగులు), అర్ష్‌దీప్ సింగ్ (72 పరుగులు) బాగా పరుగులు ఇచ్చారు. ఇంగ్లాండ్ పవర్‌ప్లేలో 58 పరుగులు చేసినప్పటికీ.. అసలు నష్టం మధ్య ఓవర్లలో జరిగింది. అక్కడ వారు 203 పరుగులు జోడించారు. భారత్ చివరి 10 ఓవర్లలో 126 పరుగులు ఇవ్వగా.. అందులో 62 పరుగులు చివరి మూడు ఓవర్లలోనే వచ్చాయి.

కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడమేంటి?
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్ యూనిట్‌ను పెద్ద దెబ్బతీసింది. కానీ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి భారత్ 15 వన్డేలు ఆడగా.. వాటిలో కుల్దీప్ కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఆడాడు. వాషింగ్టన్ సుందర్ గాయం తర్వాత, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం అతని అతిపెద్ద బలం కాబట్టి, కుల్దీప్‌కు అవకాశం లభిస్తుందని ఆశించారు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. లార్డ్స్‌లో ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్‌లో ఓడిపోవడం మాత్రమే కాదు.. 2027 వన్డే ప్రపంచ కప్‌ను గెలవాలంటే కేవలం జస్ప్రీత్ బుమ్రాపై ఆధారపడటం సరిపోదని కూడా ఇది స్పష్టం చేసింది. జట్టు మధ్య ఓవర్ల బౌలింగ్, సహనం, సరైన జట్టు కూర్పుపై త్వరగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

Story first published: Monday, July 20, 2026, 18:00 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+