Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: దంచికొట్టిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

IND vs ENG: క్రికెట్‌కు మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానం వన్డే క్రికెట్‌లో ఎన్నో భారీ స్కోర్లకు సాక్ష్యంగా నిలిచింది, కానీ ఇప్పుడు ఇంగ్లండ్ ఓ కొత్త చరిత్రను సృష్టించింది. భారత్‌పై 387 పరుగుల భారీ స్కోరు సాధించడం ద్వారా, లార్డ్స్‌లో వన్డే క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరును ఇంగ్లండ్ నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో 1975లో భారత్‌పై తాము చేసిన 334 పరుగుల రికార్డును అధిగమించింది. ఈ ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేసిన బెన్ డకెట్ అతిపెద్ద హీరోగా నిలిచాడు. జాకబ్ బెథెల్, జో రూట్ కూడా భారత బౌలర్లకు గుణపాఠం చెప్పడంలో తమ వంతు కృషి చేశారు.

IND vs ENG: లార్డ్స్ వేదికగా చరిత్ర సృష్టించిన రో-కో జోడి!

IND vs ENG: లార్డ్స్ వేదికగా చరిత్ర సృష్టించిన రో-కో జోడి!

లార్డ్స్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లీష్ బ్యాటర్లు తమ సత్తాను చాటారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరును చేసింది. టీమిండియా ముందు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ తరఫున ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ చరిత్ర సృష్టించారు.

India vs England 3rd ODI Ben Ducket Hits 141 as England Post Record 387 3 against India in Lords ODI

జాకబ్ బెథెల్, బెన్ డకెట్ ఇంగ్లండ్ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించి భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. ఆ ఇద్దరు బ్యాటర్లు భారత బౌలర్ల బౌలింగ్‌లో చితకబాది, లార్డ్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టిస్తూ ఓ రికార్డు బ్రేకింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాకబ్ బెథెల్, బెన్ డకెట్ తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించి, లార్డ్స్‌లో వన్డే క్రికెట్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును నెలకొల్పారు. జాకబ్ బెథెల్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‪లో ఔటయ్యాడు. ఆ తర్వాత బెన్ డకెట్ అద్భుతంగా ఆడి 135 బంతుల్లోనే 141 పరుగులు చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు.

చేతికి నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపకోలేరు!

చేతికి నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపకోలేరు!

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోరూట్ కూడా అజేయంగా 74 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 14 పరుగులకే ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Sunday, July 19, 2026, 19:50 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+