న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఐదేసిన బుమ్రా.. ఇంగ్లండ్​ ఆలౌట్​! భారత్ లక్ష్యం ఎంతంటే?

England all-out for 303, India target is 209

నాటింగ్‌హామ్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌటైంది. దాంతో టీమిండియా లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల కీలక ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ (109; 172 బంతుల్లో 14x4) సెంచరీతో చెలరేగగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ (32; 45 బంతుల్లో 4x4), స్టార్ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో (30; 50 బంతుల్లో 4x4), డామ్‌ సిబ్లీ (28; 133 బంతుల్లో 2x4), డానియెల్‌ లారెన్స్‌ (25; 32 బంతుల్లో 4x4) పెద్దగా ఆకట్టుకోకపోయినా.. రూట్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీయగా.. మొహ్మద్ సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

నాలుగో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆట ప్రారంభమైన కాసేపటికే మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్ రోరీ బర్న్స్‌ (18) రిషబ్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలీ (6)ని జస్ప్రీత్ బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డామ్‌ సిబ్లీ నిలకడగా ఆడాడు. మరోవైపు ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ గేరు మార్చాడు. వరుసగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

జో రూట్‌, డామ్‌ సిబ్లీలు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా రూట్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే చెత్త బంతులను బౌండరీలుగా మార్చాడు. అయితే షమీ వేసిన 38వ ఓవర్లో బౌండరీ బాదిన రూట్‌.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ అనంతరం సిబ్లీ (28; 133 బంతుల్లో 2x4) బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత బెయిర్‌స్టో (30; 50 బంతుల్లో 4x4)తో కలిసి రూట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. రూట్ నెమ్మదిగా ఆడగా.. బెయిర్‌స్టో కాస్త వేగంగా ఆడాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ ఇంగ్లీష్ స్కోర్ బోర్డును ముందుకు కదిపాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు.

అనంతరం జో రూట్‌కు డానియెల్‌ లారెన్స్‌ (25; 32 బంతుల్లో 4x4) జతకలిశాడు. లారెన్స్‌ వచ్చిరావడంతోనే భారత బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న లారెన్స్‌ను శార్ధూల్‌ ఠాకూర్‌ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన రూట్‌, బట్లర్‌ మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు. మూడో సెషన్‌ ఆరంభంలో బట్లర్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో కరన్‌ అండతో రూట్ సెంచరీ పూర్తిచేసుకుని ఔట్ అయ్యాడు. కరన్‌, రాబిన్‌సన్‌ ధాటిగా అదే క్రమంలో ఔట్ అయ్యారు.

Story first published: Saturday, August 7, 2021, 22:57 [IST]
Other articles published on Aug 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X