For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG:వర్షం అంతరాయం..చివరి రోజు ఆట ఆలస్యం!తొలి సెషన్ గోవిందా? భారత్ గెలవడం ఇష్టం లేదేమో!

India vs England 1st Test Day 5: Match start delayed due to rain, India need 157 runs

నాటింగ్‌హామ్‌: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఆట ఇంకా ఆరంభం కాలేదు. వర్షం కారణంగా ఆదివారం ఆట ఆలస్యమైంది. ఇప్ప‌టికీ నాటింగ్‌హామ్‌లో వ‌ర్షం కురుస్తోంది. పిచ్, మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మరో 2 గంటలకు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో చివరి రోజు ఆట ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దాదాపు తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయినట్టే. తొలి టెస్ట్‌లోనే చారిత్ర‌క విజ‌యంపై క‌న్నేసిన టీమిండియాకు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కూడా భారత్ ఆడదానికి వర్షమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వరణుడి ఖాతాలోకి తొలి సెషన్

వరణుడి ఖాతాలోకి తొలి సెషన్

209 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు శనివారం ఆట ముగిసే స‌మ‌యానికి ఒక వికెట్ న‌ష్టానికి 52 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. రోహిత్ క్రీజులో నిలదొక్కుకోవటానికి ప్రయత్నించగా.. రాహుల్ వేగంగా ఆడాడు. ధాటిగా ఆడే క్రమంలో స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో రాహుల్ కీపర్‌ చేతికి చిక్కాడు.

దాంతో భారత్‌ 34 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. అనంతరం జోడీ కట్టిన రోహిత్‌, పుజారా మరో వికెట్‌ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. కోహ్లీసేన విజ‌యానికి ఇంకా 157 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రోహిత్ శ‌ర్మ (12), చెటేశ్వ‌ర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు. ఇక ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు మ్యాచ్ జరుగుతున్న నాటింగ్‌హామ్‌లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ ఆలస్యం అయింది. వర్షం ఇంకా తగ్గకపోవడంతో.. తొలి సెషన్ వరణుడి ఖాతాలోకి వెళ్లిపోనుంది.

టోక్యో ఒలింపిక్స్‌ కోసం.. వాటికి ఆరు నెలలు దూరంగా ఉన్న నీరజ్‌ చోప్రా!!

భారత్ గెలవడం ఇష్టం లేదేమో:

భారత్ గెలవడం ఇష్టం లేదేమో:

వర్షం తగ్గాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు. అదే సమయంలో మరికొందరు వరణుడిపై మండిపడుతున్నారు. టెస్ట్ చాంపియ‌న్‌షిప్ పోగొట్టింది చాలదా?, తొలి టెస్ట్ విజయాన్ని కూడా అడ్డుకుంటావా?, భారత్ అంటే ఎందుకంత కసి, కోహ్లీసేన గెలవడం ఇష్టం లేదా? అని ట్వీట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌గా.. భారత్ 278 ప‌రుగులు చేసి 95 ప‌రుగుల కీల‌క‌మైన ఆధిక్యాన్ని సంపాదించిన విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో.. రూట్ సేనకు 208 ప‌రుగుల ఆధిక్యం దక్కింది.

 ఉదయం నుంచి వర్షం:

ఉదయం నుంచి వర్షం:

ఈ టెస్టు మ్యాచ్‌కి ఆరంభం నుంచి వరుణుడు అడ్డుపడుతున్నాడు. తొలిరోజు ఆట సజావుగా సాగగా.. రెండు, మూడు రోజుల్లో చివరి సెషన్లు రద్దైయ్యాయి. నాలుగో రోజు ఆట సజావుగానే సాగగా.. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నాలుగో రోజు చివరకు భారత్ ఆధిపత్యం చెలాయించింది. విజయానికి కేవలం 157 ప‌రుగుల దూరంలోనే ఉంది. ఇప్పటికే కొన్ని గంటల విలువైన మ్యాచ్ సమయం వేస్ట్‌కాగా.. ఈరోజు కనీసం ఓ రెండు సెషన్ల ఆట జరిగినా భారత్ జట్టు గెలుపు లక్ష్యాన్ని అందుకునే అవకాశం ఉంది. కానీ నాటింగ్‌హామ్ పరిసరాల్లో ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతోంది. దాంతో అది కూడా సాధ్యం కాకపోవచ్చు. వరణుడు కరుణిస్తాడేమో చూడాలి. ఇంగ్లండ్ గడ్డపై మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది.

Story first published: Sunday, August 8, 2021, 17:04 [IST]
Other articles published on Aug 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+