13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ, 14వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన తన మూడో ఓవర్లో ఇంగ్లండ్ను శాసించాడు.
ధోని అద్భుతమైన స్టంపింగ్
ఈ ఓవర్ తొలి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ అందుకోగా.... అ తర్వాత అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతమైన స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్స్టో డకౌట్గా వెనుదిరిగాడు. ఈ స్టంపింగ్తో కమ్రాన్ పాక్ వికెట్ కీపర్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ధోని సమం చేశాడు.
అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపరగా ధోని
ఆ తర్వాత బంతికే జో రూట్ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని అరుదైన ఘనత సాధించాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యం
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో లోకేశ్ రాహుల్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 5సిక్సర్లు) అద్భుత సెంచరీతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. కెప్టెన్ కోహ్లీ (8 నాటౌట్) పరుగులతో నిలిచాడు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు:
* మహేంద్ర సింగ్ ధోని - 33 స్టంపింగ్స్
* కమ్రాన్ అక్మల్ - 32
* మహ్మద్ షెహజాద్ - 28
* ముష్ఫీకర్ రహీం - 26
* కుమార సంగక్కర - 20