
హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 152/6 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-0తో వైట్వాష్ చేసింది. అంతకముందు ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ 360 పాయింట్లకు చేరింది. రెండు ఇన్నింగ్స్ల్లో 9 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని దక్కించుకున్నాడు. భారత్లో జరిగిన తొలి డే నైట్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఎవరేమన్నారో తెలుసా?